- Your PIN
- Trending
- Following

Khalistani Terror Threat: ఖలిస్థానీ ఉగ్రవాదుల ముప్పు.. ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భారీ ముప్పు..రంగంలోకి కేంద్ర బలగాలు!
New Delhi, Delhi:Delhi Uttarakhand Terror Threat: ఖలిస్తానీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఈమెయిల్ బెదిరింపులతో హై అలర్ట్!
ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ భద్రతా సంస్థలకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అందులోని సమాచారం ప్రకారం.. పలు ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, రాజకీయ నాయకులు, అలాగే పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు గట్టిగా అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ ఈమెయిళ్ల మూలాలపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో నిహాంగ్ సిక్కులకు, స్థానిక పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు రావడం గమనార్హం.
అసలేం జరిగింది?
జూన్ 16 (చమోలి ఘటన): హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ యాత్రికులకు, కర్ణప్రయాగ్లోని స్థానిక వ్యాపారులకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది కాస్తా హింసాత్మకంగా మారి, నలుగురు నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడంతో నలుగురు స్థానికులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిహాంగ్లను అరెస్ట్ చేశారు. తమ వారిని విడుదల చేయాలంటూ నిహాంగ్ సిక్కుల బృందం జూన్ 20న రుద్రప్రయాగ్లోని ఒక గురుద్వారాను ఆక్రమించింది. ఆ తర్వాత జూన్ 25న డెహ్రాడూన్కు భారీ పాదయాత్ర చేపట్టింది.
సద్దుమణిగిన ఉద్రిక్తతలు
హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద నిహాంగ్ సిక్కులకు, పోలీసులకు మధ్య కొన్ని రోజులుగా కొనసాగిన ప్రతిష్టంభన ఎట్టకేలకు శాంతించింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో, నిహాంగ్ బృందం తమ ఆందోళనను విరమించుకుని వెనుదిరిగింది.
ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గినప్పటికీ, ఖలిస్తానీ ముప్పు పొంచి ఉందన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాలు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద రక్షణ వలయాన్ని భారీగా పెంచారు.
Also REad: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
