డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Patancheruvu, Telangana:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. డివిజన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నూతన కాలనీలలో మంచినీటి సరఫరా పైప్ లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.కొత్తపల్లి గ్రామంలో ఆల్ఫా జోలం తయారీ కేంద్రంపై నార్కోటెక్ టీం తనిఖీలు ఒక కేజీ 500 గ్రాములు స్వాధీనం
Gummadidala, Domadugu, Telangana:గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గల కోళ్ల ఫామ్ లో 2.5 కేజీల నిషేధిత ఆల్ఫా జోలం డ్రక్స్ ను తెలంగాణ నార్కోటిక్స్ జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకుట్టుకొని అంజిరెడ్డి రాకేష్ ఇద్దరు అరెస్ట్ ప్రభాకర్ గౌడ్ ఒక్కరూ పరారిలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం లో తెలిపారు. అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ఆల్పాజోలం లాంటి మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ముఠాను NAB, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
మెట్రో పనులను ప్రారంభించండి మెట్రో ఎండికి విన్నవించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Bonthapalle, Telangana:పెరుగుతున్న జనాభా అనుగుణంగా గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన విధంగా మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో పనులు ప్రారంభించాలని, పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ హైదరాబాద్ లోని మెట్రో రైల్ కార్యాలయంలో మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పరిశ్రమ వాడక పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడంలో మెట్రో రైలు ఏర్పాటు కీలక భూమిక పోషించనుందని తెలిపారుఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Ramachandrapuram, Telangana:సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ఎస్సీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ పుష్పా నగేష్, సింధు ఆదర్శరెడ్డి, మాజీ కౌన్సిలర్ అంజయ్య, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
