Back
Ajay Krishna R
Sangareddy502319

డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Ajay Krishna RAjay Krishna RJun 19, 2024 10:40:41
Patancheruvu, Telangana:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. డివిజన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నూతన కాలనీలలో మంచినీటి సరఫరా పైప్ లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
0
Report
Medak502313

కొత్తపల్లి గ్రామంలో ఆల్ఫా జోలం తయారీ కేంద్రంపై నార్కోటెక్ టీం తనిఖీలు ఒక కేజీ 500 గ్రాములు స్వాధీనం

Ajay Krishna RAjay Krishna RJun 19, 2024 09:13:58
Gummadidala, Domadugu, Telangana:

గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గల కోళ్ల ఫామ్ లో 2.5 కేజీల నిషేధిత ఆల్ఫా జోలం డ్రక్స్ ను తెలంగాణ నార్కోటిక్స్ జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకుట్టుకొని అంజిరెడ్డి రాకేష్ ఇద్దరు అరెస్ట్ ప్రభాకర్ గౌడ్ ఒక్కరూ పరారిలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం లో తెలిపారు. అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ఆల్పాజోలం లాంటి మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ముఠాను NAB, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

0
Report
Sangareddy500043

మెట్రో పనులను ప్రారంభించండి మెట్రో ఎండికి విన్నవించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Ajay Krishna RAjay Krishna RJun 19, 2024 07:04:38
Bonthapalle, Telangana:
పెరుగుతున్న జనాభా అనుగుణంగా గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన విధంగా మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో పనులు ప్రారంభించాలని, పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ హైదరాబాద్ లోని మెట్రో రైల్ కార్యాలయంలో మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పరిశ్రమ వాడక పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడంలో మెట్రో రైలు ఏర్పాటు కీలక భూమిక పోషించనుందని తెలిపారు
0
Report
Sangareddy502032

ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Ajay Krishna RAjay Krishna RJun 19, 2024 05:27:39
Ramachandrapuram, Telangana:

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ఎస్సీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ పుష్పా నగేష్, సింధు ఆదర్శరెడ్డి, మాజీ కౌన్సిలర్ అంజయ్య, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

0
Report
Advertisement
Sangareddy500090

బొల్లారంలో ఇష్టరాజ్యంగా గ్యాస్ దందా చేస్తున్న హెచ్ పి ఎస్ వి ఎస్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు

Ajay Krishna RAjay Krishna RJun 16, 2024 11:05:57
Hyderabad, Telangana:
సంగారెడ్డి: IDA బొల్లారం మున్సిపల్ లో HP SVSగ్యాస్ ఏజన్సీ వారు ఇంటింటికి సిలిండర్ సరఫరా చేయకుండా ఒకేచోట సిలిండర్ల వాహనాన్ని నిలిపి ఇష్టారీతిన ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని బొల్లారం అధ్యక్షుడు KJR ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. సమస్యపై సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించక పోతే రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.
0
Report
Sangareddy502300

ముత్తంగి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను ప్రారంభిస్తున్న ఎంపీ రఘునందన్రావు

Ajay Krishna RAjay Krishna RJun 16, 2024 06:16:01
Hyderabad, Telangana:
మెదక్ పార్లమెంట్ సభ్యులుగా రఘునందన్ రావు గెలిచిన సందర్భంగా మొక్కు చెల్లించేందుకు ముత్తంగి గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి మరియు వారి బృందం ముత్తంగి నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్రగా బయలుదేరుతున్న సందర్భంగా పూజలో పాల్గొని, జెండా ఊపి యాత్రను ప్రారంభించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
0
Report
Sangareddy502307

ఇస్నాపూర్ తేజ కాలనీలో 620 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం ఒక్కరి అరెస్ట్

Ajay Krishna RAjay Krishna RJun 15, 2024 10:13:48
Hyderabad, Telangana:
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ తేజ కాలనీ ఎండు గంజాయిని అమ్ముతున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాజిద్ ఇక్బాల్ ను పట్టుకున్న మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 620 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
1
Report