502110
మెదక్ పట్టణంలోని సాయి నగర్ కాలనీ మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాశీ తలపించిన నవరాత్రి ఉత్సవం.
Medak, Telangana:మెదక్ పట్టణంలో సాయి నగర్ కాలనీ మణికంఠ గణేష్ మండలిలో నవరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వారణాసి బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేకంగా సాయి నగర్ గణేష్ మండలిలో వీనుల విందైన అద్భుత మహత్తర హారతి ద్వారా పౌరాణిక సందేశాలను అందించాయి. ఈ ఉత్సవంలో, గణేష్ విగ్రహ నిమజ్జనం సమయంలో విశేషమైన పూజా విధానాలు జరుపబడ్డాయి. కాశీని తలపించిన ఈ వేడుకలు మెదక్ పట్టణానికి ఒక మకుటాయమానంగా నిలిచాయి.ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవం సాయి నగర్ మండలికి ప్రత్యేక స్థానం ఇచ్చింది.0
0
Report
502110
భారీవర్షలకు దెబ్బతిన్న పోచారం డ్యామ్ వరదకు నష్టపోయిన రైతులను పరామర్శించి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Medak, Telangana:ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వలన వర్ష ఉధృతికి దెబ్బతిన్న పోచారం డ్యామ్ ను మరియు వరదకు నష్టపోయిన రైతులను పరామర్శించి మాట్లాడుతూ నేనున్నానని భరోసా తెలియజేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నష్టపోయిన రైతులకు మరియు వరద బాధితులకు ఈరోజు మరొకసారి నేనున్నాను అని చెప్పేసి మనోధర్యం తెలియజేశాడు. బాధితులు అందరికీ నష్టపరిహారం చెల్లిస్తానని నేను కూడా మీలో ఒకడ్ని అని బాధితులందరికీ తెలిపారు. ఈ సందర్భంగా మనోధైర్యం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకు ప్రజలు ఒక నమ్మకంతో ఆత్మస్వర్యం నింపుకున్నారు.0
0
Report
502110
వరదల్లో చిక్కుకున్న క్షతగాత్రులకు రక్షించేందుకుమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ కృషి.
Medak, Telangana:మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా హవేలీ ఘన్పూర్ మండలంలో ఆటో కొట్టుకుపోయి అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో మెదక్ ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు వారికి సందేశం ఇవ్వడం జరగడంతో వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ సీఎంఓ, సి ఎస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలతో నిరంతరం సమన్వయంతో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నారు0
0
Report
Advertisement
502110
మట్టి విగ్రహాలని పూజించాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపినారు.
Medak, Telangana:ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలని పూజించాలని వివిధ రంగులతో విష రసాయనాలతో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజకు వినియోగించరాదని రంగురంగుల విగ్రహాలు అత్యంత ప్రమాదకరమని నిమజ్జనంలో నీటిలోని జీవరాశులకు హాని చేస్తాయన్నారు. మట్టి ప్రతిమాలను పూజించి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి బాలకృష్ణ వారి బృందం తదితరులు పాల్గొన్నారు.0
0
Report
502110
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
Medak, Telangana:సోమవారం జిల్లా కలెక్టర్ తూప్రాన్ లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రత్నాపూర్ గ్రామంలోని హల్దీ వాగు వంతెన నిర్మాణ పనులు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణపురోగతిని పరిశీలిస్తూ త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలని పేదవారి సొంతింటి కల నెరవేర్చుకోవాలని తెలిపారు. గ్రామ పరిసరాలను పరిశీలిస్తూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.0
0
Report
